Terrorist Attack |అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బిజ్బిహరా ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగింది. పోలీస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. బిజ్బిహరా పోలీస్ కానిస్టేబుల్పై ఉగ్రవాదులు నేరుగా కాల్పులు జరిపారని ఒక పోలీసు అధికారి చెప్పారు.
తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను చికిత్స కోసం సమీప దవాఖానకు తరలించామని పోలీసులు చెప్పారు. కాలికి అయిన బుల్లెట్ గాయానికి వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందన్నారు. గాయపడిన పోలీసు కానిస్టేబుల్ పేరు ఫిర్దోస్ అహ్మద్ అని అన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.