చండీగఢ్: గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో శత్రువులు ఈ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు పథకాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం నాడు పంజాబ్ పోలీసులు ఈ కుట్రను బట్టబయలు చేశారు.
గురుదాస్పూర్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజికోట్కు చెందిన మల్కీత్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించినట్లు మల్కీత్ అంగీకరించాడు.
మల్కీత్ సింగ్ ఇచ్చిన సమాచారంతో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రనేడ్ లాంచర్తపాటు 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు పోలీసులకు లభించాయి. పాక్ నుంచి ఈ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిఖ్ యూత్ ఫెడరేషన్ చీఫ్ లఖ్బీర్ సింగ్ వీటిని పంపి ఉంటాడని అనుమానిస్తున్నారు.