న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్టు 22 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా భల్లా 2019 ఆగస్టులో నియమితులైన విషయం తెలిసిందే. అయితే 2021 ఆగస్టు 22 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు కేంద్రం ఆయన పదవిని పొడిగించింది.