న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారతదేశ ఉత్తర సరిహద్దు (ఎల్ఏసీ)లో పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ టెన్షన్ వాతావరణమే ఉన్నదని సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్పాండే తెలిపారు. 2020లో చైనా సైన్యంతో ఘర్షణ తర్వాత ఉత్తర సరిహద్దు పొడవునా భారీగా బలగాలను మోహరించామని, ఇప్పటికీ బలగాలు అక్కడ ఉన్నాయని ఓ ఇంటర్యూలో ఆయన పేర్కొన్నారు. పశ్చిమ సరిహద్దు (పాకిస్థాన్తో ఉన్నది) కంటే ఉత్తర సరిహద్దుకే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఉత్తర సరిహద్దు వెంట భారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ప్రశాంతంగా మార్చేందుకు చైనా సైన్యంతో వివిధ స్థాయిల్లో 32 రౌండ్ల పాటు చర్చలు జరిపినట్టు వివరించారు.