గోపాల్గంజ్: ఒక పూజారిని కాల్చి చంపడమే కాక, అతని కనుగుడ్లు పీకేసిన దారుణ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా దానాపూర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 32 ఏండ్ల మనోజ్ కుమార్ అనే పూజారి గత సోమవారం నుంచి కన్పించకుండాపోవడంతో కుటుంబసభ్యులు మంగళవారం ఫిర్యాదు చేశారు. పొదల్లో పడి ఉన్న అతని మృతదేహాన్ని శనివారం సాయంత్రం కనుగొన్నారు. అతడికి కాల్చి చంపడమే కాక, నేత్రాలు పీకేశారు. అతని ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్టు పోలీసులు తెలిపారు.