ముంబై: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ రకం ( Delta plus variant ) కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా అక్కడ మరో 10 మంది కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అందులో కొల్హాపూర్కు చెందిన వారు ఆరుగురు, రత్నగిరికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. మరో కేసు సింధుదుర్గ్లో బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కొత్తగా బయటపడిన 10 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం డెల్టా ప్లస్ కేసుల సంఖ్య 76కు చేరిందని తెలిపారు.
కాగా, మొత్తం 76 డెల్టా ప్లస్ కేసులలో ఐదుగురు వ్యాధి తీవ్రత ముదరడంతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.