న్యూఢిల్లీ, డిసెంబర్ 25: విదేశాల నుంచి వచ్చే సీజనల్ వర్కర్ల కోసం తాత్కాలిక వీసాల పథకాన్ని 2024 వరకు పొడిగించినట్టు బ్రిటన్ ప్రకటించింది. వచ్చే ఏడాది 40 వేల టెంపరరీ వీసాలు ఇస్తామని తెలిపింది. తర్వాత ఏడాది నుంచి వీసాల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని పేర్కొన్నది. బ్రెగ్జిట్ అనంతరం వ్యవసాయ కూలీలు, పంట ఉత్పత్తులు, సరుకు రవాణా కోసం బ్రిటన్ ఎక్కువగా వలస కూలీలపై ఆధారపడుతున్నది. ఇందుకు పనుల కోసం వచ్చేవారికి తాత్కాలిక వీసాల పథకాన్ని 2019 మార్చిలో ప్రకటించింది.