Tejasvi Surya : కర్నాటకలో పాలక కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. బెంగళూర్లో ఓ దుకాణదారు తన షాపులో భజన పాటలు వింటుండగా కొందరు వ్యక్తులు అజాన్ సమయంలో లౌడ్ మ్యూజిక్ వినిపించరాదని అంటూ దాడి చేయడాన్ని ఎంపీ ఖండించారు. దుకాణదారు ముఖేష్ను సోమవారం ఎంపీ తేజస్వి సూర్య పరామర్శించారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు నిందితులను రేపటి లోగా అరెస్ట్ చేయనిపక్షంలో నాగరత్పేట్లో బీజేపీ బంద్కు పిలుపు ఇస్తుందని ఆయన హెచ్చరించారు. షాపు వెలుపల నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. తన షాపులో భజనలను వినిపిస్తున్న దుకాణదారుపై అజన్ సమయంలో భజనలను అనుమతించబోమని సంఘ వ్యతిరేక శక్తులు దాడి చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వ బుజ్జగింపు రాజకీయాల ఫలితంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా తేజస్వి సూర్య రాసుకొచ్చారు.
కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారికి బెయిల్ లభించిందని అన్నారు. జిహాదీలకు ఇలాంటి రాజకీయ మద్దతు లభించడంతో కర్నాటకలో హిందువులకు వ్యతిరేకంగా ఇలాంటి ఘటనలు సహజంగానే పెచ్చుమీరుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
ఇండియన్ యూట్యూబర్తో ఇరాన్ యువతి నిశ్చితార్ధం