ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ కొన్ని రోజుల క్రిందటే వివాహం చేసుకున్నారు. హనీమూన్కు వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే పాస్పోర్ట్ రూపంలో ఓ ప్రతిబంధకం వచ్చి పడింది. ఓ కేసులో ఈడీ ప్రత్యేక కోర్టు 2018 లో ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకుంది. దీంతో హనీమూన్కు ఆటంకం ఏర్పడిందని సమాచారం.తేజస్వీ తన పాస్పోర్టు కావాలని ఈడీకి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. తేజస్వీ దరఖాస్తును ఈడీ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈడీ కోర్టు పాస్పోర్టు ఇస్తే తేజస్వీ యాదవ్ దంపతులు యూరోప్ హానీమూన్ వెళ్లనున్నారు.