Tejas Rajdhani Express | బిహార్ భాగల్పూర్లో పెను రైలు ప్రమాదం తప్పింది. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైన తొలిరోజే ప్రమాదం నుంచి బయటపడింది. గుర్తు తెలియని దుండకులు సాహిబ్గంజ్-భాగల్పూర్ రైల్వేట్రాక్పై దుండగులు రాళ్లు వేయగా.. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు రాయిని ఢీకొట్టింది. దాంతో ఇంజిన్ కొంత భాగం దెబ్బతిన్నది. తేజస్ ఎక్స్ప్రెస్ అగర్తలా నుంచి ఆనంద్ విహార్కు విహార్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. మహారాజ్పూర్ సమీపంలోని ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్పై రాళ్లు వేయడంతో రైలు ఇంజిన్ కొంత దెబ్బతిన్నది.
ఘటన తర్వాత రైలు కొద్దిసేపు అక్కడే నిలిచిపోయింది. అనంతరం రైల్వే బృందానికి సమాచారం అందించారు. ఆ తర్వాత రైలు నిర్ణీత సమయానికంటే ముందే భాగల్పూర్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ తొలిసారిగా వచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్కు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటనపై ఏడీఆర్ఎం శివకుమార్ ప్రసాద్ మాట్లాడుతూ తేజస్ రైలు వెళ్లడానికి ముందు గూడ్స్ రైలు వెళ్లిందని.. ఆ సమయంలో ట్రాక్పై రాళ్లు లేవని తెలిపారు. తేజస్ రైలు వచ్చే ముందు దుండగులు ఉద్దేశపూర్వకంగానే రాళ్లను పెట్టినట్లు తెలుస్తుందన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఎవరి హస్తమున్నా వదిలేదని స్పష్టం చేశారు.