చెన్నై: రథోత్సవానికి హాజరైన యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక చోటకు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Teen gang raped) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 9న 17 ఏళ్ల యువతి వెల్లకోవిల్లోని వీరకుమారస్వామి రథోత్సవాన్ని చూసేందుకు అక్కడకు వెళ్లింది.
కాగా, ఏడుగురు వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఒక ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు కామరాజపురమ్కు చెందిన 32 ఏళ్ల నిందితుడిని, 29 ఏళ్ల మరో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి సేకరించిన సమాచారంతో మిగతా ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.