న్యూఢిల్లీ: భారత్కు చెందిన సూపర్సోనిక్ క్షిపణి పాకిస్థాన్లో పడింది. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన హర్యానాలోని సిర్సా నుంచి బుధవారం సాయంత్రం ప్రయోగించిన పేలుడు పదార్థంలేని సూపర్సోనిక్ క్షిపణి తమ భూభాగంలోని 124 కిలోమీటర్ల పరిధిలో పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత క్షిపణి పడిన ప్రాంతం అంత కీలకం కానప్పటికీ దీని వల్ల గోడ కూలిందని పాక్ వాయు సేన తెలిపింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది.
కాగా, ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్తోపాటు భారత్ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపుఈ ఘటనపై భారత్ శుక్రవారం స్పందించింది. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు విచారం వ్యక్తం చేసింది. ఈ నెల 9న సాధారణ నిర్వహణలో భాగంగా సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి ఫైరింగ్ జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది. భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించడడంతోపాటు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. క్షిపణి పడిన ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడం ఊరటనిచ్చిందని పేర్కొంది.