బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్థిక మాంద్యం భయాలు చుట్టుముట్టిన వేళ.. టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. మెటా, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు మొదలుకొని చిన్న సంస్థలు చాలా వరకూ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. కొత్త ఉద్యోగులను కూడా చేర్చుకోవడం లేదు. ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.