కశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ హత్యను నిరసిస్తూ, ఆయన కుటుంబీకులు, ప్రభుత్వ అధికారులు, కశ్మీరీ పండిట్లు జమ్మూ కశ్మీర్లోని బుడ్గామ్ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు. ఎల్జీ మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో నిరసన కారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకరంగా మారిపోయింది.
తమకు ఎల్జీ మనోజ్ సిన్హా వెంటనే రక్షణ కల్పించాలని, లేదంటే సామూహిక రాజీనామాలు చేస్తామని అమిత్ అనే కశ్మీరీ పండిట్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక.. మరో కశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. తమపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించే బదులు.. ఉగ్రవాదులను పట్టుకోవచ్చు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆ తర్వాత పలువురు ఉద్యోగులు రాహుల్ భట్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాహుల్ భట్ను శ్రీనగర్కు రెఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
#WATCH Police fire tear gas shells at protestors to prevent them from moving towards the Airport Road in Budgam during their protest demonstration against the recent killings of Kashmiri Pandits in the Union Territory pic.twitter.com/EPHvomqH9j
— ANI (@ANI) May 13, 2022