Maha Crisis | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 17 మంది రెబెల్స్పై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ ముందు శివసేన పిటిషన్ దాఖలు చేసిందని సమాచారం. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సారధ్యంలో దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు రెబెల్స్గా మారారు.
వారంతా గువాహటిలోని ఒక లగ్జరీ హోటల్లో బస చేస్తున్నారు. శివసేనలో చీలిక తేవడానికి ఏక్నాథ్ షిండేకు 37 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికి ఐదుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని అనర్హత పిటిషన్లు వేశారని తెలుస్తున్నది. మిగతా వారిపై పిటిషన్లు సిద్ధం చేస్తున్నారని సమాచారం.
శివసేనలో అధికారికంగా చీలిక తెచ్చేందుకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్న షిండేకు గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జత కలిశారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే.. సొంత పార్టీలోనే మైనారిటీలో పడిపోయినట్లు కనిపిస్తున్నది. బాల్ఠాక్రే పార్టీని స్థాపించిన తర్వాత గత నాలుగు దశాబ్దాల్లో శివసేన మైనారిటీలో పడిపోవడం ఇదే తొలిసారి.