కొజికోడ్: ఉత్తర కేరళ జిల్లాలోని ఓ స్కూల్లో టీచర్లు(School Teachers) తన్నుకున్నారు. ఆ ఘటనలో ఏడు మంది టీచర్లు గాయపడ్డారు. ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో లింకున్న ఓ టీచర్ను అరెస్టు చేశారు. నిజానికి ఈ ఘటన గత వారమే జరిగినా.. ఆ దాడికి చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. దీంతో కేసు బుక్ చేసిన పోలీసులు ఓ టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన టీచర్లకు చెడు పేరు తేవడంతో.. శాఖాపరమైన దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.
A crazy fight broke out between teachers during a staff meeting in a primary #school at #kozhikode. 5 people injured.
Great example for childrens 🙄#Kerala #keralapolice #teacher pic.twitter.com/oJxJMcajX2
— Manu (@manureporting) November 14, 2023
వివరాల్లోకి వెళ్తే.. ఏయూపీ స్కూల్లో జరుగుతున్న మీటింగ్కు మరో స్కూల్కు చెందిన టీచర్ వచ్చి రచ్చ చేశాడు. భర్త మరో స్కూల్లో టీచర్ కాగా, భార్య మాత్రం ఏయూపీ స్కూల్లో టీచర్గా చేస్తోంది. అయితే ఆ స్కూల్కు చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదును ఎంపీ షాజీ అనే మరో స్కూల్ టీచర్ చైల్డ్లైన్కు ఫార్వర్డ్ చేశాడు. ఇక స్కూల్ మీటింగ్లో షాజీ భార్యను ఇతర టీచర్లు నిలదీశారు. ఆ సమయంలో భార్యను పికప్ చేసుకునేందుకు స్కూల్కు వచ్చిన అతను.. ఆ మీటింగ్లో ఉన్న టీచర్లతో ఘర్షణకు దిగాడు. దీంతో టీచర్ల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. టీచర్ షాజీని బుధవారం అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. స్థానిక కోర్టు ముందు అతన్ని హాజరుపరిచారు.