మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది. అయితే ఆమె మెయిన్పురిలోని కొత్వాలీ ప్రాంతంలో నాటు తుపాకీ జేబులో పెట్టుకొని తిరుగుతుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా ఆమె పాయింట్ జేబులో దేశీయ తుపాకీ లభించింది. దీంతో ఆ టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆమెపై అక్రమాయుధాల కేసు నమోదు చేశామని మెయిన్పురి ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె తుపాకీతో ఎక్కడికి వెళ్తున్నది, దానికి ఎక్కడ నుంచి సేకరించిందనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు.