న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచనుంది. 2024, జనవరి 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపుదల తప్పలేదని పేర్కొంది. ఈ ధరల పెరుగుదల అన్ని వాణిజ్య వాహనాలకు వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రయాణికుల వాహ న తయారీదారులు మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మ హీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి లాంటి కంపెనీలు సైతం జనవరి నుంచి ధరలు పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.