న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల పరీక్షలకు సంబంధించి సంస్కరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ కోరింది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ, భద్రత, మూల్యాంకన పద్ధతి తదితర అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంస్థల నుంచి వీటిని ఆహ్వానిస్తున్నది. ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సెప్టెంబర్ 13లోగా వాటిని టాస్క్ఫోర్స్కు సమర్పించాలని కేంద్రం తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది.
నీట్ పేపర్ లీక్ అనంతరం ఎన్టీఏ సహా వివిధ రకాల ప్రభుత్వ పరీక్షల్లో సంస్కరణలపై కేంద్రం ఉన్నతస్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన, సురక్షితమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా టాస్క్ఫోర్స్ కమి టీ పనిచేయనున్నదని కేంద్రం తెలిపింది.