భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎంగా శివ, బీజేపీ రాష్ట్ర చీఫ్గా విష్ణు ఉండటంతో ఆ రాష్ట్రాన్నికరోనా వైరస్ ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలకు కరోనా వాలంటీర్లుగా పనిచేసేందుకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటైన సందర్భంగా చుగ్ భోపాల్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్గా విష్ణువు ఉండగా ఇక మధ్యప్రదేశ్ను మహమ్మారి ఏం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
కాగా మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తుండగా కాషాయ పార్టీ రాష్ట్ర చీఫ్గా విష్ణుదత్ శర్మ పనిచేస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారితో ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య రాష్ట్రంలో 3.28 లక్షల మంది కరోనా బారినపడి మరణించగా మరణాలు ఇంకా అధిక సంఖ్యలో ఉంటాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్టీ కార్యకర్తలు, నేతల మెప్పు కోసమే బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది.