బెంగళూరు, డిసెంబర్ 27: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రతి గుడి వార్షిక లక్ష్యాలను పెట్టుకొని పూర్తి చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తేజస్వీ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్లో హిందూ పునరుజ్జీవంపై తన వ్యాఖ్యలను అనవసరంగా వివాదం చేశారన్నారు.