న్యూఢిల్లీ: లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కోట్ల మంది మహిళలు సాధికారత, స్వయంసమృద్ధతతో గ్రామీణ సాంఘిక, ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చుతున్నారని చెప్పారు.
ఈ పథకం క్రింద ఇప్పటికే ఒక కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని తెలిపారు.