చెన్నై: తమిళనాడు గవర్నర్(Tamilnadu Governor ) ఆర్ఎన్ రవి .. డీఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ ఆయన ప్రసంగం చేశారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగం ప్రారంభానికి ముందు, చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జాతీయ గీతాన్ని డీఎంకే గౌరవించలేదన్నారు. అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
గవర్నర్ ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. అయితే ప్రసంగ పాఠంలో ఉన్న అనేక అంశాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అంగీకరించిన అంశాల గురించి ప్రసంగంలో చెప్పడం.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. సభ మీద ఉన్న గౌరవంతో తన ప్రసంగాన్ని త్వరగా ముగించేస్తున్నట్లు చెప్పారు.
అయితే సభాకార్యక్రమాలు సజావుగా సాగాలని, ప్రజల కోసం ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టాలని రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కూడా తన ప్రసంగాన్ని అర్థాంతంగా ముగించిన విషయం తెలిసిందే.
#WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7
— ANI (@ANI) February 12, 2024