చెన్నై: తమిళనాడులో వచ్చే నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులను పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు స్కూళ్లలోనే ఆహారం అందించనున్నారు. అయితే 1-8 తరగతుల పునరుద్ధరణపై సెప్టెంబర్ 15 తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు కాలేజీలు, పాలిటెక్నిక్ సంస్థలను కూడా సెప్టెంబర్ 1 నుంచి రొటేషన్ పద్ధతిలో తెరువనున్నారు. ఈ నేపథ్యంలో ఈలోపు టీచింగ్, ఇతర సిబ్బంది కరోనా టీకా తీసుకునేలా చూడాలని ఆయా విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కొన్ని సడలింపులతో కరోనా లాక్డౌన్ ఆంక్షలను సెప్టెంబర్ 9 వరకు పొడిగించింది.