Udhayanidhi stalin | చెన్నై, సెప్టెంబర్ 10: బీజేపీ ఒక విష సర్పమని, ప్రజలు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ జీ20 సమావేశం సందర్భంగా పేదల మురికివాడలను కనపడకుండా దాచేసిన ప్రధాని మోదీ తానెంతో అభివృద్ధిని సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని విపక్ష ఏఐడీఎంకే ఒక పనికిరాని పార్టీ అని, తమిళనాడులో తలదాచుకునేందుకు బీజీపీకి అది చోటిస్తున్నదని విమర్శించారు.