చెన్నై : డీఎంకేను (DMK) వారసత్వ పార్టీగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు. అమిత్ షా కుమారుడి జే షాకి ఏ అర్హత ఉందని బీసీసీఐ కార్యదర్శి పదవి కట్టబెట్టారని మంత్రి ప్రశ్నించారు. చెన్నైలో డీఎంకే యువజన విభాగం నూతన కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అమిత్ షా ఆరోపణలను తోసిపుచ్చారు.
తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిక్లలో గెలుపొందిన తర్వాతే మంత్రిని అయ్యానని గుర్తుచేశారు. తనను సీఎం చేయాలన్నదే తమ పార్టీ నేతల ధ్యేయమని అమిత్ షా చెబుతున్నారని, అయితే మీ కుమారుడు బీసీసీఐ కార్యదర్శిగా ఎలా అయ్యారని తాను ఆయనను ప్రశ్నిస్తున్నానని అన్నారు.
జే షా ఎన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడారు..ఆయన ఎన్ని పరుగులు చేశారని ఉదయనిధి స్టాలిన్ కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశారు. కాగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై రామేశ్వరం నుంచి చేపట్టిన పాదయాత్రను ప్రారంభిస్తూ డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు. వారసత్వ రాజకీయాలే డీఎంకే పరమావధి అని దుయ్యబట్టారు.
Read More :