Tamil Nadu | చెన్నై: ఇస్రో స్పేస్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటనలో దొర్లిన ఒక భారీ తప్పిదం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసింది. చైనా జెండాతో కూడిన రాకెట్ను ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలం సృష్టించింది. తూత్తుకూడి జిల్లా, కులశేఖరపట్టణం స్పేస్ పోర్టుకు ప్రధాని బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ దిన పత్రికలలో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రకటనలు వెలువరించింది. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్లో తయారు చేసిన ప్రకటనలో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ చిత్రాల వెనుక ఉన్న ఇస్రో రాకెట్ చుట్టూ భారత జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను పెట్టడం వివాదానికి దారితీసింది. డీఎంకే ప్రభుత్వం అన్ని హద్దులు మీరిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు.