చెన్నై, ఏప్రిల్ 7: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదాన్ని రాజేశారు. గురువారం రాజ్భవన్లో సివిల్స్ ఆశావహులతో నిర్వహించిన ‘థింక్ టు డేర్’ కార్యక్రమంలో బిల్లుల పెండింగ్పై ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా మాట్లాడారు. ‘గవర్నర్కు మూడు మార్గాలుంటాయి. ఒకటి.. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించటం. రెండు.. పెండింగ్లో పెట్టడం. బిల్లును పెండింగ్లో పెట్టడమంటే అది చనిపోయినట్టే లెక్క. పెండింగ్ పెట్టడాన్నే మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు పద్ధతైన భాషలో తిరస్కరించటం అని పేర్కొన్నాయి. మూడో మార్గం.. బిల్లును రాష్ట్రపతికి పంపటం. ఇది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
బిల్లు రాజ్యాంగ పరిధిని దాటకుండా గవర్నర్ చూస్తారు. అలాగే రాష్ట్రప్రభుత్వం తన అధికార పరిధిని అతిక్రమించకుండా చర్యలు తీసుకొంటారు’ అని వ్యాఖ్యానించారు.గవర్నర్ రవి ప్రకటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘అధికారిక నిర్ణయాన్ని గవర్నర్ అత్యంత నిర్లక్ష్యంగా బహిరంగంగా చెప్పటమంటే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే. గవర్నర్ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై దాడిచేయటమే. గవర్నర్ ఆర్ఎన్ రవి తనకుతాను నియంతలా ఊహించుకోకపోవటం మంచిది’ అని చురకలంటించారు.