చెన్నై: తమిళనాడులో ఓ కాలేజీ అమ్మాయిని గ్యాంగ్ రేప్కు గురైంది. ఆమె స్నేహితుడి ముందే అయిదుగురు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కాంచీపురంలో జరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు ఓ నిర్మానుష ప్రదేశంలో ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో.. అక్కడకు చేరుకున్న అయిదుగురు ఆకతాయిలు వాళ్లును చుట్టుముట్టారు. అబ్బాయిని కత్తితో బెదిరించిన ఆ గ్యాంగ్.. విద్యార్థినిని రేప్ చేశారు. ఒకవేళ ఒప్పుకోకుంటే మర్డర్ చేస్తామని కూడా ఆ అమ్మాయిని బెదిరించారు. ఆ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లారు. విద్యార్థిని హాస్పిటల్లో చేర్పించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
చీకటి ఉండడం వల్ల ఆ గ్యాంగ్ను గుర్తుపట్టలేకపోయానని, కానీ ఓ వ్యక్తి విమల్ అని పిలవడం గమనించినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. విపాడు గ్రామంలో ఉన్న విమల్ను చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగుర్ని పట్టుకున్నారు. మణికందన్, శివకుమార్, విఘ్నేశ్, తెన్నారుసులను అదుపులోకి తీసుకున్నారు. అయిదుగురిపై రేప్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.