చెన్నై: రాష్ట్ర మంత్రి సెంథిల్ని ఈడీ అధికారులు విచారణ పేరుతో దాదాపు 18 గంటల పాటు నిర్భందించి, ఎవరినీ కలవకుండా చేశారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ఓ వ్యక్తిని ఉగ్రవాది మాదిరిగా విచారించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
మంత్రి పట్ల ఈడీ అధికారుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు గురువారం స్టాలిన్ ట్విట్టర్లో ప్రసంగ వీడియో పోస్టు చేశారు. మోదీ సర్కార్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నదని దుయ్యబట్టారు.