Chennai | తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ లాక్డౌన్ ప్రారంభమై, సోమవారం ఉదయం 5 గంటల వరకూ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆదివారాల్లో లాక్డౌన్ విధిస్తున్నామని ఈ నెల 9 న ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో వుంది. ఇక తమిళనాడులో కొత్తగా 28,561 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.