Taliban Mindset | సోనూసూద్ ఇల్లు, ఆఫీసులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ దాడులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తాలిబన్ మనసత్వాని
కి నిదర్శనం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆప్ సర్కార్కు బ్రాండ్ అంబసిడార్గా నియమితులైనందుకు రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ దాడులు చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో లక్షల మంది వలస కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సాయం చేశారు సోనూసూద్. తద్వారా వలస కార్మికుల ఆత్మబంధువుగా (మైసయ్య ఆఫ్ మైగ్రెంట్స్) అని పేరు తెచ్చుకున్నారు. గొప్ప పరోపకారిని చూసి ప్రభుత్వం అభద్రతాభావానికి గురవుతున్నదని రాఘవ్ చద్దా ఆరోపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కూడా నేరమేనా? అని ఆమ్ ప్రశ్నించింది.
మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్సీ మనీషా కయాండే స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి.. తాలిబన్ల మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాదరణ పొందిన నటుడు సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆప్ సర్కార్ రాయబారిగా నియమితులు కావడం దీనికి కారణం కావచ్చు. బీజేపీయేతర పార్టీలకు మద్దతు ఇచ్చిన వారు దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కావచ్చు.. ఐటీ దాడులు కావచ్చు… ఇది తాలిబన్ల మనస్తత్వానికి అతి సమీపంలో ఉందన్నారు మనీషా కయాండే.