గువాహటి: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభిస్తున్నది. లఖింపూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుదన్నది. ఈ నేపథ్యంలో ఈ స్వైన్ ఫీవర్ ఇతర జిల్లాలకు పాకకుండా కట్టడి చేయడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విస్తరణకు ప్రధాన కారణమైన పందుల నిర్మూలనకు జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటివరకు వెయ్యి పందులను కరెంట్ షాక్ పెట్టి చంపేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా విస్తరించింది. దాంతో అసోంలోకి ఆ వ్యాధులు ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి పందులు, ఫౌల్ట్రీ చేరవేతపై నిషేధం విధించింది. పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ను కలుగజేసే వైరస్ ఆస్ఫర్విరిడే కుటుంబానికి చెందిన పెద్దదైన డబుల్ స్ట్రాండెడ్ డీఎన్ఏ వైరస్. పందుల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల జంతువుల్లో మరణాల రేటు భారీగా ఉంటుంది.