న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్ స్టేషన్లలో రైల్వే ప్రయాణికులకు తన సేవలను అందించనున్నట్టు ప్రకటించింది. రాబోయే వారాల్లో దేశంలోని మరో 59 రైల్వే స్టేషన్లకు తమ సేవలను విస్తరించనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు ఐఆర్సీటీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. రైలు ప్రయాణికులు ఐఆర్సీటీసీ యాప్లోకి వెళ్లి తమకు ఏ స్టేషన్లలో, ఏ ఆహారం ఆయా స్థానిక రెస్టారెంట్ల నుంచి కావాలో పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి ఆర్డర్ ఇవ్వవచ్చునని స్విగ్గీ సీఈవో తెలిపారు.