వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు.
ఇక ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ఆయన ఇవాళి అర్పించారు.