Loksabha Elections 2024 : కర్నాటకలోని ఫకీరేశ్వర్ మఠానికి చెందిన జగద్గురు ఫకీర దింగళేశ్వర్ మహాస్వామి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తమ వర్గాన్ని అణగదొక్కుతున్నారని దింగళేశ్వర్ మహాస్వామి ఆరోపించారు. జోషీ ఈ ప్రాంతానికి ఎలాంటి సేవలు అందించలేదని దుయ్యబట్టారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్ధులను పోటీలో నిలుపుతున్నాయి.
తాజాగా ఫకీరేశ్వర్ మఠాధిపతి ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తుండటంతో ఉత్కంఠ పోరు నెలకొంది.ఫకీర దింగళేశ్వర్ మహాస్వామికి ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో భక్తులు, శిష్య గణం ఉంది. స్వామీజీ ఎవరి ఓట్లు చీల్చుతారోనని ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో గుబులు రేగుతోంది.
Read More :