న్యూఢిల్లీ: పార్లమెంట్లో అనుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఎంపీ అధీర్ రంజన్ చౌదరిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు. పార్లమెంటరీ ప్యానల్ ముందు హాజరైన కొద్దిసేపటికి కమిటీ సిఫార్సు మేరకు అతనిపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు అధీర్ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో ఈ నెల 10న ఉద్దేశపూర్వకంగా తానలా వ్యవహరించలేదని చెప్పారు.