న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను మంగళవారం ఎత్తివేశారు. రాజ్యసభలో 11 ప్రతిపక్ష ఎంపీలపై చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఎత్తేయగా, లోక్సభలో ముగ్గురు ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ తొలగించారు. 14 మంది ఎంపీల సస్పెన్షన్ తొలగించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఉభయ సభాపతులు అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.