భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఢిల్లీలో జరిగిన శ్రద్ధా తరహా హత్య జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. అనంతరం అడవిలో వేర్వేరుగా పాతిపెట్టాడు. షాష్డోల్ జిల్లాలోని గ్రామానికి చెందిన రామ్ కిషోర్ పటేల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య సరస్వతీ పటేల్కు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యను మెహ్రౌలీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ గొడ్డలితో ఆమె తల నరికాడు. అనంతరం ఆ అటవీ ప్రాంతంలో తల, మొండాన్ని వేర్వేరుగా పాతిపెట్టాడు.
కాగా, తన సోదరుడు, వదిన కనిపించడం లేదంటూ ఒక వ్యక్తి ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక మహిళ దుస్తులు కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆ దుస్తులు అదృశ్యమైన మహిళకు చెందినవిగా గుర్తించారు. ఆ అటవీ ప్రాంతాన్ని పరిశీలించగా తల, మొండెం వేర్వేరుగా పాతిపెట్టినట్లు గ్రహించారు. వెలికి తీసిన ఆ శరీర భాగాలు అదృశ్యమైన సరస్వతీవిగా నిర్ధారించారు.
అనంతరం ఆమె భర్త కోసం పోలీసులు వెతికారు. నార్సింగ్పూర్లోని కరేలీ ప్రాంతంలో ఉన్న రామ్ కిషోర్ను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా అనుమానంతో భార్యను రెండు ముక్కలుగా నరికి చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు వినియోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.