జమ్మూ కశ్మీర్ : కశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతని నుంచి గ్రెనెడ్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో లష్కరే యిబాతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల సమాచారంతో పోలీసులు ఖాన్ ప్రాంతంలో పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించి ప్రశ్నించగా.. పారిపోయేందుకు యత్నించాడు.
అతన్ని పట్టుకొని విచారించారు. సదరు వ్యక్తిని అర్షద్ అహ్మద్ మీర్గా గుర్తించారు. అర్షద్ మీర్, తన సోదరుడు లతీఫ్ అహ్మద్ గ్రూప్ రిక్రూట్మెంట్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. లతీఫ్ మీర్ను గతంలో ఖీర్ భవానీ పోలీస్స్టేషన్లో ఉపా (UAPA), ఆయుధాల చట్టంలోని సెక్షన్ 13 అండ్ 39 కింద అరెస్టు చేశారు. అర్షద్ అహ్మద్ మీర్పై పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలా (నివారణ) చట్టం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.