Surrogacy | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అద్దె గర్భం (సరగసీ) ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. తద్వారా దంపతుల్లో ఎవరో ఒకరు వైద్య సమస్యతో బాధపడుతున్నట్టయితేనే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది.
ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్యపరమైన సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుందని, అప్పుడే దాత బీజకణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. దంపతులిద్దరూ వైద్య సమస్యలతో బాధపడుతున్నా లేక వారికి సొంత బీజకణాలు లేకపోయినా సరగసీని ఎంచుకునేందుకు వీలుండదు.