Suresh N Patel | సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేష్ ఎన్ పటేల్ నియాకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్లో బుధవారం సురేష్ పటేల్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. సురేష్ పటేల్ గతేడాది జూన్ నుంచి ఆయన తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)గా పని చేస్తున్నారు.
రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు సీవీసీ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగ్గా.. సురేష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సురేష్ పటేల్ ఇంతకు ముందు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా సేవలందించారు. 2020, ఏప్రిల్లో ఆయన విజిలెన్స్ కమిషన్గా నియామకమయ్యారు. ఇంతకుముందు సీవీసీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి సంజయ్ కొఠారీ గతేడాది జూన్ 24న పదవీ విరమణ చేశారు.