న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి గానూ నిపుణుల ప్యానెల్ ఏర్పాటుపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం తీర్పు వెలువరించనున్నది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ షేర్లు కుప్పకూలడం, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి నిపుణుల ప్యానెల్ను నియమించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే.