న్యూఢిల్లీ, జూలై 13: నీట్-ఎండీఎస్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ -మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ) కౌన్సెలింగ్పై కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నీట్-ఎండీఎస్ ప్రవేశ పరీక్ష పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వాళ్లంతా అర్హత పొందిన బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) విద్యార్థులు. గతేడాది నుంచి వారికి కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించడం లేదు. వారికి డిగ్రీ రాకుండా మీరు అడ్డుకుంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌన్సెలింగ్ను ఎప్పుడు నిర్వహిస్తారో వారంలోగా చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు, ‘నీట్’ పీజీ పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశా ఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ తెలిపారు.