నోయిడాలో అక్రమ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రముఖ రియల్టీ సంస్థ సూపర్టెక్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు పేరిట నోయిడాలో నిర్మించిన 40 అంతస్తుల జంట టవర్లను 3 నెలల్లో కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్టెక్ యాజమాన్యంతో నోయిడా అధికారులు కుమ్మక్కయ్యారని, టవర్ల నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టవర్లలో ఫ్లాట్ల కోసం కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం సొమ్మును వారికి 12 శాతం వడ్డీతో తిరిగివ్వాలని తీర్పు చెప్పింది. ఈ టవర్ల నిర్మాణం వల్ల ఇబ్బందులకు గురైన రెసిడెంట్ వేల్ఫేర్ అసియేషన్కు రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును సూపర్టెక్ సంస్థే భరించాలని, కూల్చివేత పనులను నొయిడా అధికారులు నిపుణులతో కలిసి పనులను పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ టవర్లను కూల్చివేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా ఆదేశించింది.