న్యూఢిల్లీ, జూలై 26: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్పై విచారణ మీద స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఔషధాలను అక్రమంగా సేకరించి పంపిణీ చేసినట్టు గంభీర్ ఫౌండేషన్పై కేసు నమోదైంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. స్టే కోరుతూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఉపశమనం కోసం ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.