Supreme Court | హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసు చేసినప్పటికీ హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని సవాల్ చేస్తూ బెంగళూరుకు చెందిన అడ్వొకేట్ అసోసియేషన్ బెంగళూరు దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యాన్ని సవాల్చేస్తూ అడ్వొకేట్స్ అసోసియేషన్ బెంగళూరు దాఖలుచేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు వ్యక్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణితో జస్టిస్ కౌల్ మాట్లాడుతూ ‘సాధారణంగా మీడియా నివేదికలను మేం పెద్దగా పట్టించుకోం. కానీ, ఓ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి.. టీవీ ఇంటర్వ్యూలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇంతకంటే మేం ఏం చెప్పలేం. దీన్ని పరిష్కరించండి. ఈ వ్యవహారంలో మేం న్యాయపరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకురావొద్దు’ ఘాటుగా స్పందించారు. ఎలాంటి కారణాలు లేకుండా కొలీజియం సిఫారసులను పెండింగ్లో పెట్టొద్దని, కొన్ని పేర్లను ఏడాదిన్నరకుపైగా పెండింగ్లోనే పెడుతున్నారని, దీంతో వ్యవస్థ ఎలా పని చేస్తుంది? అని ప్రశ్నించింది. ఇది మొత్తం వ్యవస్థకే విసుగుతెప్పిస్తోందని ధర్మాసనం పేర్కొంది. జైతోష్ మజుందార్పేరును కొలీజియం రెండోసారి ప్రతిపాదించినప్పటికీ 2021 సెప్టెంబర్ 4 నుంచి ఆయన నియామకం పెండింగ్లో ఉందని, చివరకు సదరు వ్యక్తి ఇటీవల కన్నుమూశారనని గుర్తు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన మరొకరు ఆలస్యం కారణంగా తనంతట తానే వెనక్కి తగ్గారని పేర్కొంది.
ఈ కేసులో ప్రస్తుతం నోటీసులు మాత్రే జారీ చేస్తున్నామని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అటార్నీ జనరల్కు ధర్మాసనం సూచించింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (NJAC) చట్టం ఆమోదం పొందకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించగా.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. కేసు విచారణను డిసెంబర్ 8వ తేదీకి సుప్రీకోర్టు వాయిదా వేసింది.