న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో ఉప వర్గీకరణ అనుమతించదగినదేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు చెప్పబోతున్నది. మూడు రోజులపాటు వాదనలను విన్న తర్వాత తీర్పును ఫిబ్రవరి 8న వాయిదా చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి 2020లో నివేదించింది. వర్గీకరణ అనుమతించదగినది కాదని ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చెప్పింది.