న్యూఢిల్లీ, మార్చి 16: హిజాబ్ అంశంపై హోలీ తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. విచారణ ఎప్పుడు చేపడుతామనేది కూడా హోలీ తర్వాతే లిస్టింగ్ చేస్తామని తెలిపింది. విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరోవైపు, హిజాబ్ను నిషేధించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉడుపిలోని ముస్లిం విద్యార్థినులు బుధవారం కాలేజీకి హాజరు కాలేదు. హిజాబ్పై నిషేధం విధిస్తే తాము కాలేజీకి వెళ్లబోమని, న్యాయం కోసం పోరాడతామని వారు తేల్చి చెప్పారు.