న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. మళ్లీ వర్చువల్గా కేసులను విచారించనున్నది. జనవరి 3 నుంచి వర్చువల్ సిస్టం ఆఫ్ హియరింగ్కి మారాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రెండు వారాల పాటు ఈ విధానంలో కేసుల విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోని హైకోర్టులు, జిల్లా కోర్టులు మళ్లీ వర్చువల్ బాట పడుతున్నాయి.